రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,671 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 179 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,616కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి... కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
మొత్తం మరణాల సంఖ్య 7,138కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 219 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,76,000కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: