ETV Bharat / city

పంచాయతీరాజ్​ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం​ నిధులు విడుదల

author img

By

Published : Jul 10, 2020, 12:06 AM IST

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్​ కింద రూ.656.25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్​ సంస్థలకు ఈ నిధులు విడుదలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

పంచాయతీరాజ్​ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం​ నిధులు విడుదల
పంచాయతీరాజ్​ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం​ నిధులు విడుదల

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతగా రూ.656.25 కోట్ల నిధులు విడుదలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పంచాయతీ రాజ్ సంస్థలకు ఈ గ్రాంట్ విడుదల చేసినట్లు ప్రకటించింది. గ్రామ పంచాయతీలు, మండల్ ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులకు ఈ నిధులు కేటాయించనున్నారు. అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించుకునే సదుపాయం ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ తెలిపారు.

ఇదీ చదవండి : పశ్చిమగోదావరి జిల్లా వైకాపాలో తారస్థాయికి వర్గపోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.