ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా కల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

author img

By

Published : Apr 28, 2021, 5:14 PM IST

Updated : Apr 28, 2021, 7:10 PM IST

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

15:37 April 28

కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరసబారిన పడుతోన్న బాధితులతో పాటు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,748 పరీక్షలు నిర్వహించగా.. 14,669 కేసులు నిర్ధారణ కాగా.. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,69,544 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,62,17,831 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో నెల్లూరులో తొమ్మిది మంది; కృష్ణాలో ఎనిమిది; అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరంలో ఏడుగురు చొప్పున; చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; విశాఖలో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, కర్నూలులో నలుగురేసి; ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున; కడప జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,871కి చేరింది. 24 గంటల వ్యవధిలో 6,433 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,54,062కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,07,611 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా గుంటూరులో 2,072 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 506 మంది వైరస్‌ బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇదీ చదవండి: 

మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్

టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ.. కొవిన్‌ పోర్టల్‌ క్రాష్‌

Last Updated : Apr 28, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.