ETV Bharat / business

బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత

author img

By

Published : Feb 1, 2020, 12:57 PM IST

central-finance-minister
central-finance-minister

పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీరి కవితను చదివి వినిపించారు. దీనానాధ్​ కౌల్​ రాసిన " నా దేశం... దాల్​ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం... సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం వంటింది. మానవత్వం, దయతో కూడింది... నా దేశం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది"’ అంటూ కశ్మీరి కవితకు అర్థాన్ని వివరించారు. తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడానికే ఈ కవితను వినిపించానని ఆమె తెలిపారు. గత బడ్జెట్​ సమావేశంలోనూ ఆమె తమిళంలో ఓ కథ చెప్పారు.

బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.