ETV Bharat / bharat

అత్తింటిపై పెట్రోల్ పోసి నిప్పు.. భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనం

author img

By

Published : Oct 18, 2022, 5:29 PM IST

అత్తింటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణం పంజాబ్​లోని​ జలంధర్​లో జరిగింది.

family burns alive in punjab
family burns alive in punjab

పంజాబ్​ జలంధర్​లో దారుణం జరిగింది. అత్తింటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది
పరమ్​జీత్​ కౌర్​ అనే మహిళ మెహతాపుర్​ సమీపంలోని మద్దేపుర్ గ్రామం​లో నివసిస్తోంది. పేద కుటుంబానికి చెందిన పరమ్​జీత్ కౌర్..​ మొదట పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం భర్త చనిపోవడం వల్ల ఖుర్​సైద్​పురకు చెందిన ఖాలోతో రెండో వివాహం చేశారు. మొదట్లో బాగానే ఉన్న ఖాలో.. కొన్ని రోజుల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను విడిచిపెట్టాలని చెప్పేవాడు. దీనికి కౌర్​ ఒప్పుకోకపోవడం వల్ల తీవ్రంగా కొట్టేవాడు.

అతడి వేధింపులకు తాళలేక పిల్లలను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఎంత చెప్పినా భార్య మాట వినడం లేదని ఆగ్రహించిన ఖాలో.. అతడి స్నేహితులతో కలిసి మద్దేపుర్​లోని అత్తింటికి వచ్చాడు. ఎవరూ బయటకు రాకుండా ఇంటి తలుపులు మూసి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు. ఈ ప్రమాదంలో పరమ్​జీత్​ కౌర్​, ఆమె తండ్రి సుర్జన్​ సింగ్, తల్లి జోగింద్రో దేవి, పిల్లలు గల్మోహర్​, అర్ష్​దీప్​ సజీవ దహనమయ్యారు.

ఇవీ చదవండి: బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ

ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడ్ని నూతిలో వేలాడదీసి విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.