ETV Bharat / bharat

సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై 10 మంది అత్యాచారం.. ఎవరూ లేని ప్రాంతానికి లాక్కెళ్లి..

author img

By

Published : Oct 22, 2022, 10:47 AM IST

Updated : Oct 22, 2022, 11:31 AM IST

స్నేహితుడితో కలిసి రోడ్డుపై మాట్లాడుతున్న ఓ యవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు పది మంది దుండగులు. మరోవైపు 2016లో జరిగిన ఓ అత్యాచార ఘటనపై తాజాగా కేసు నమోదయ్యింది.

software employee gang rape in jharkhand
gang rape in jharkhand

సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పని చేస్తున్న ఓ యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. యువతి పరిస్థితి విషమించగా నిందితులంతా.. అక్కడనుంచి పరారయ్యారు. బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిందంతా వెల్లడించింది. దీంతో వారు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఝార్ఖండ్​లోని ఛాయిభాసా జిల్లాలోని ముఫాసిల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని నివసిస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఆమె.. ప్రస్తుతం వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తోంది. బాధితురాలు.. అక్టోబర్​ 20న సాయంత్రం 5 గంటల సమయంలో తన స్నేహితుడి​తో కలిసి విమానాశ్రయానికి స్కూటీపై వెళ్లింది. అక్కడ కాసేపు ఇద్దరు కలిసి ముచ్చటిస్తుండగా చీకటి పడింది. ఆ సమయంలో ఓ 10 మంది యువకులు వచ్చి వారిద్దరిని చితకబాదారు. యువతితో పాటు అతని స్నేహితుడి వద్ద నుంచి సెల్​ఫోన్​తో పాటు ఐదు వేల రూపాయల నగదు లాక్కున్నారు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్నాక.. నిందితులు ఆమెను అక్కడే వదిలి పరారయ్యారు.

స్ఫృహలోకి వచ్చాక ఇంటికి చేరుకున్న యువతి.. తల్లిద్రండ్రులకు అసలు విషయం తెలిపింది. వెంటనే వారందరూ పోలీస్​ స్టేషన్​కు చేరుకుని ఆ పది మంది నిందితులపై ఫిర్యాదు చేశారు. యువతి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణను ప్రారంభించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన 2016 ఘటన...
2016లో ఓ యువతి పై జరిగిన అత్యాచారంపై తాజాగా కేసు నమోదయ్యింది. పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మథురాలో జరిగింది.

బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో తన కూతురు మైనర్​గా ఉన్న సమయంలో ఆమె తాగిన డ్రింక్​లో వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు మత్తు పదార్థాలు కలిపారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను ఓ హోటల్​కి తీసుకెళ్లి వ్యభిచారం చేయించాలని చూశారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియగా వారి వద్దకు వెళ్లిన ఇద్దరు నిందితుల్లో ఒకరు.. తమను క్షమించమని వేడుకున్నాడు. తన సోదరుడికి బాలికతో వివాహం జరిపిస్తానని యువకుడు హామీ ఇచ్చాడు. అన్నాట్లుగానే వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది.

బంధువులను కలిసేందుకు బాలికను తీసుకెళ్తామని తల్లిదండ్రులకు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. అశ్లీల ఫొటోలు, వీడియోలు సైతం చిత్రీకరించేవారు. అలా జూలై 16,2020లో ఆమెను ఒక గెస్ట్​హౌస్​కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను మరో వ్యక్తికి అప్పజెప్పారు. అతడు సైతం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని కోర్టుకు వెళ్లాడు బాధితురాలి తండ్రి. జడ్జి ఉత్తర్వులతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ముంబయిలో హైఅలర్ట్.. వారి ప్రాణాలకు ముప్పు.. 15రోజులు అవన్నీ బంద్

దీపావళికి ఇంటికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 15 మంది కూలీలు మృతి

Last Updated : Oct 22, 2022, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.