ETV Bharat / bharat

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం

author img

By

Published : Aug 27, 2022, 10:54 AM IST

Updated : Aug 27, 2022, 11:48 AM IST

Justice UU Lalit భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు జస్టిస్​ యుయు లలిత్​. జస్టిస్‌ లలిత్‌తో సీజేఐగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.

cji oath ceremony
cji oath ceremony

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం

Justice UU Lalit: భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ 74 రోజులపాటు పనిచేయనున్నారు.

Justice UU Lalit
ప్రమాణం చేస్తున్న జస్టిస్ యుయు లలిత్​

దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ముమ్మారు తలాక్‌ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యుయు లలిత్‌ భాగస్వామి. బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా ఘనత సాధించారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

1957, నవంబరు 9న జన్మించిన జస్టిస్​ లలిత్​.. 1983 జూన్​లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 జనవరి నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.

ముమ్మారు తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ యుయు లలిత్‌ సభ్యుడు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ యుయు లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది.

ఇవీ చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తుల్లో 9 మంది దక్షిణాది వారే

న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ

Last Updated : Aug 27, 2022, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.