ETV Bharat / bharat

17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

author img

By

Published : Sep 14, 2020, 3:23 PM IST

Updated : Sep 14, 2020, 3:47 PM IST

పార్లమెంటు​ సమావేశాల వేళ ఎంపీల్లో కరోనా కలకలం రేపింది. ఏకంగా 17 మంది పార్లమెంట్​ సభ్యులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.

17 MPs tested Corona Positive
17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పార్లమెంటు వర్షాకాల​ సమావేశాల వేళ 17 మంది ఎంపీలకు కరోనా నిర్ధరణ అయింది. వైరస్​ సోకినవారిలో 12 మంది అధికార భాజపాకు చెందినవారు కాగా.. వైకాపా సభ్యులు ఇద్దరు, ఆర్​ఎల్పీ, శివసేన, డీఎంకే నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.

వైకాపా ఎంపీల్లో గొడ్డేటి మాధవి, రెడ్డప్ప.. భాజపాలో అనంత కుమార్​ హెగ్డే, మీనాక్షి లేఖి, పర్వేశ్​ సాహిబ్​ సింగ్​లు ఉన్నారు.

పార్లమెంటు​ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సభ్యులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో నెగెటివ్​ అని తేలాకే పార్లమెంట్​లోకి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్

Last Updated : Sep 14, 2020, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.