ETV Bharat / bharat

గుజరాత్​లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ

author img

By

Published : Nov 4, 2022, 2:46 PM IST

Updated : Nov 4, 2022, 3:48 PM IST

గుజరాత్​ ఎన్నికల్లో​ ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు.

gujarat cm candidate isduan gadhvi
gujarat cm candidate isduan gadhvi

గుజరాత్​ ఎన్నికల్లో​ ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. సీఎం అభ్యర్థి కోసం ఆన్​లైన్ పోల్ నిర్వహించిన ఆప్.. ఈ మేరకు గఢ్వీని ఎంపిక చేసింది. ఆన్​లైన్ పోల్ ఫలితాలను ప్రకటించిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గఢ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 16 లక్షల మంది ఓటింగ్​లో పాల్గొన్నారని చెప్పిన కేజ్రీవాల్.. అందులో 73 శాతం మంది గఢ్వీని ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఎవరీ ఈశుదాన్ గఢ్వీ
గుజరాత్‌ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన ఈశుదాన్ గఢ్వీ ఓ జర్నలిస్టు. ఓబీసీ వర్గానికి చెందిన ఈయన.. దేవభూమి ద్వారకా జిల్లాలోని పిప్లియాలో జన్మించారు. జామ్ ఖంభాలియాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కామర్స్‌లో పట్టభద్రుడయ్యాక, 2005లో గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం చదివారు.

ఆ తర్వాత దూరదర్శన్‌లో చేరి అక్కడ ఓ షో చేయడం ప్రారంభించారు. పోర్‌బందర్‌లోని 'ఈటీవీ గుజరాతీ' ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. 2015లో ఈశుదాన్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ గుజరాతీ ఛానెల్​కు ఎడిటర్ అయ్యారు. 'మహామంథన్' పేరుతో ఓ షోను ప్రారంభించిన ఈశూదాన్​.. అందులో యాంకర్​గా వ్యవహరించారు. ఈ షోతో ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్​ ద్వారా స్పందించాలని గతవారం కేజ్రీవాల్.. ప్రజలను కోరారు. నవంబర్ 3 సాయంత్రం వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని, వారి అభిప్రాయాల ఆధారంగా మరుసటి రోజు పార్టీ ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పంజాబ్​ ఎన్నికల్లోనూ ఆప్​ ఇదే విధంగా తమ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసింది. ఈ పోల్​లో మెజారిటీ సభ్యులు భగవంత్​ మాన్​ను ఎన్నుకున్నారు. "పంజాబ్ ఎన్నికల సమయంలో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలని మేము ప్రజలను అడిగాము, అప్పడు వారు భారీ మెజారిటీతో భగవంత్ మాన్ ఎంపిక చేశారు. ప్రజల కోరిక మేరకు మేము అతన్ని ముఖ్యమంత్రి చేశాము" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.​

ఇదీ చదవండి: దిల్లీలో తీవ్రస్థాయికి కాలుష్యం​.. స్కూళ్లకు సెలవులు

పోలింగ్ బూత్ మొత్తానికి ఒక్కరే ఓటర్.. ఆయన కోసం 8 మందితో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు

Last Updated : Nov 4, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.