Tractor Overturned Several People Injured: బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజు గడ్డ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారికి రేపల్లె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన సుమారు 30 మంది నగరం మండలంలో బంధువుల ఇంటికి ఓ వేడుకకు హాజరయ్యారు. వేడుక అయ్యాక మోర్తోట వద్ద కృష్ణా నదిలో స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో కామరాజుగడ్డ గ్రామ సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి.
ట్రాక్టర్ బోల్తాపడి 15 మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 7:21 PM IST
|Updated : May 24, 2024, 8:25 PM IST
Tractor Overturned Several People Injured: బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజు గడ్డ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారికి రేపల్లె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన సుమారు 30 మంది నగరం మండలంలో బంధువుల ఇంటికి ఓ వేడుకకు హాజరయ్యారు. వేడుక అయ్యాక మోర్తోట వద్ద కృష్ణా నదిలో స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో కామరాజుగడ్డ గ్రామ సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి.