ETV Bharat / snippets

ట్రాక్టర్ బోల్తాపడి 15 మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 7:21 PM IST

Updated : May 24, 2024, 8:25 PM IST

Tractor Overturned
Tractor Overturned (ETV Bharat)

Tractor Overturned Several People Injured: బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజు గడ్డ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారికి రేపల్లె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన సుమారు 30 మంది నగరం మండలంలో బంధువుల ఇంటికి ఓ వేడుకకు హాజరయ్యారు. వేడుక అయ్యాక మోర్తోట వద్ద కృష్ణా నదిలో స్నానాలు చేసి తిరుగు ప్రయాణంలో కామరాజుగడ్డ గ్రామ సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి.

Last Updated : May 24, 2024, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.