Telangana CM Revanth Reddy Tirumala Visit: శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. మనవడికి పుట్టు వెంట్రుకల మొక్కుబడిని స్వామివారికి తీర్చనున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు బయల్దేరడంతో, నేటి ఆయన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. బుధవారం ఉదయం స్వామివారిని దర్శనానంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.
తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - స్వాగతం పలికిన టీటీడీ ఈవో
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 8:22 PM IST
![తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - స్వాగతం పలికిన టీటీడీ ఈవో Telangana CM Revanth Tirumala Visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/1200-675-21525602-thumbnail-16x9-telangana-cm-revanth-tirumala-visit.jpg?imwidth=3840)
Telangana CM Revanth Reddy Tirumala Visit: శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. మనవడికి పుట్టు వెంట్రుకల మొక్కుబడిని స్వామివారికి తీర్చనున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు బయల్దేరడంతో, నేటి ఆయన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. బుధవారం ఉదయం స్వామివారిని దర్శనానంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.