ETV Bharat / snippets

కోడుమూరు వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా - ఇద్దరు చిన్నారులు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 7:09 AM IST

Road Accident in Kodumur of Kurnool District
Road Accident in Kodumur of Kurnool District (ETV Bharat)

Road Accident in Kodumur of Kurnool District : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు, ప్యాలకుర్తి మధ్య లో బోల్తా పడింది. డ్రైవర్ అతి వేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధని(8) చిన్నారులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కోడుమూరు, కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.