ETV Bharat / snippets

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 9:06 AM IST

Devotees Rush in Tirumala Temple
Devotees Rush in Tirumala Temple (ETV Bharat)

Devotees Rush in Tirumala Temple : భక్తుల రద్దీ దృష్ట్యా టోకెన్లు లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆపై రింగ్‌రోడ్డు మీదుగా కల్యాణవేదిక వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. మూడు రోజులుగా రద్దీ భారీగా పెరగడంతో గదులు, అన్నప్రసాదాలు, ఇతర వసతుల కోసం భక్తులు అవస్థలు పడుతున్నారు. రద్దీ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. శనివారం శ్రీవారిని 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.40 కోట్లు కోట్లు హుండీ కానుకలు లభించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.