ఎన్నికల కోడ్ ఉల్లం'ఘనులు'- రంజాన్ తోఫా పేరుతో వైసీపీ నేత కానుకలు అందజేత - YSRCP Leaders Violate Election Code
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 10:40 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21186466-thumbnail-16x9-ysrcp-leaders-violate-election-code.jpg)
YSRCP Leaders Violate Election Code : సార్వత్రికల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని కేంద్ర ఎన్నకల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ నేతలు కుటిల ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. నిబంధనలు తమకేమీ పట్టవన్నట్లు అధికార పార్టీ నేతలు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ నేత రంజాన్ తోఫా పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు
జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డు కౌన్సిలర్ శ్రీలక్ష్మి భర్త, వైఎస్సార్సీపీ నేత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. రంజాన్ తోఫా పేరుతో వార్డులో అందరికీ కానుకలు అందించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రంజాన్ తోఫా పేరుతో కానుకలు అందిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు నేరుగా కానుకలు అందించలేక, ఇలాంటి ప్రత్యామ్నాయ దారులు ఎంచుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.