కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి - జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న వైసీపీ నేతలు - YCP Attack on Janasena leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:43 PM IST

thumbnail

YCP Leaders attacked to Janasena Worker in kurnool District : కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పాణ్యం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కాటసాని వాహానాన్ని జనసేన కార్యకర్త అడ్డగించి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్లే, పాణ్యం నియోజకవర్గనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపార్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు తడనక పల్లె గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను రద్ధు చేస్తారని వ్యాఖ్యానించారు. 

YCP Attack on Janasena Leaders : దీంతో కోపోద్రిక్తుడైన జనసేన అభిమాని సలాం ప్రచార వాహనాన్ని అడ్డగించి కాటసానితో వాదనకు దిగారు. వెంటనే కాటసాని అనుచరులు సలాంపై చేయి చేసుకున్నారు. అనంతరం గొడవ పెద్దదై ఇరువర్గలు పరస్పరం దాడులు చేసుకునేదాక వెళ్లింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.