సీఐ దూషించారని ఇద్దరు వ్యక్తులు పెట్రోలు సీసాతో ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 8:56 AM IST

thumbnail

Two Peoples Attempted in Nandyala District : నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ రాజారెడ్డి దూషించారంటూ ఇద్దరు వ్యక్తులు పెట్రోలు సీసాతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక కేసు విషయంలో సలీమ్ నగర్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తితోపాటు మరో వ్యక్తిని స్టేషన్ కు పిలిపించారు. సీఐ రాజారెడ్డి అకారణంగా తమను దూషించి  కొట్టారని బాధితులు వాపోయారు. దీంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, నాయకులు తులసిరెడ్డి, మనోహర్రెడ్డి, ఆవాజ్ కమిటీ నాయకులు వచ్చి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. 

బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సీఐ దూషించి నట్లు తేలితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, బాధితులకు న్యాయం చేస్తామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దీంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై డీఎస్పీ మహేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా వాళ్లు డబ్బు విషయంలో ఘర్షణ పడటంతో కేసులు నమోదు చేశామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.