మా ఓట్లు వేరేవాళ్లు వేస్తున్నారు - గిరిజనుల ఆవేదన - Tribal People Protest for Vote

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 3:30 PM IST

thumbnail
మాకు ఓటు వేసే స్వేచ్ఛను కల్పించండి : గిరిజనులు (ETV Bharat)

Tribal People Protest for Vote in Annamayya District : తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా అగ్రవర్ణానికి చెందిన నేతలు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం చలంపాలెం ఎస్టీ కాలనీకి చెందిన గిరిజనులు నిరసనలు చేశారు. దశాబ్దాలుగా నుంచి వేరే గ్రామంలో పోలింగ్​ బూత్​ ఉండడంతో వారిని భయపెట్టి అగ్రవర్ణానికి చెందిన వారు తమ ఓట్లను వేసుకుంటున్నారని వాపోయారు. తమ గ్రామంలోనే పోలింగ్​ బూత్​ను ఏర్పాటు చేస్తే తాము కూడా ఓటు హక్కు వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

తమ గ్రామంలో పోలింగ్​ బూత్​ను ఏర్పాటు చేయమని అధికారులను ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఓట్లు వేయకుండా అగ్ర వర్ణానికి చెందిన వారు అడ్డుకున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కరుణించి తమ ఓటు హక్కును తామే వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.