టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన వైఎస్సార్సీపీ నేతలు - తెలుగుదేశం శ్రేణుల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 4:36 PM IST

thumbnail

TDP Leaders Protest on Flexi Issue in Nellore District : నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతఊరులో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ నాయకులు ధ్వంసం చేశారని టీడీపీ (TDP) నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ దగ్గుమాటి వెంకటకృష్ణా రెడ్డి ఫొటోలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు చించివేశారని టీడీపీ అనుచరులు ఆరోపించారు. ఫ్లెక్సీలు (Flexi) ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

YSRCP Leaders Torn TDP Flexis in Kavali : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష, అధికార పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాట్లు అధికమయ్యాయి. అయితే ఈ ప్రచారాలు పలు చోట్ల వైఎస్సార్సీపీ (YSRCP), తెలుగుదేశం పార్టీల మధ్య వివాదలకు దారి తీస్తున్న విషయం విదితమే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రోజురోజుకు పెరుగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.