పుంగనూరు ఏపీలో భాగం కాదా? అక్కడ పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా? : వర్ల రామయ్య - TDP Varla Ramaiah Complaint to CEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 10:51 PM IST

thumbnail

TDP Leader Varla Ramaiah Complaint To CEO : చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గం ఏపీలో భాగం కాదా? అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాలుగు ప్రచార రథాలు తగులబెట్టారని మండిపడ్డారు. అక్కడి పరిస్థితిపై డీజీపీ సైతం చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అక్కడ కానిస్టేబుల్ నుండి పోలీస్ ఉన్నతాధికారులు వరకు కేంద్రబలగాలను పెట్టి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై సీఈఓ ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

పుంగనూరులో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే అక్కడి డీఎస్పీ మాత్రం ఆ ప్రాంతంలో ఏమి జరగలేదని చెబుతున్నారు. కేవలం కారుపై రెండు రాళ్లు వేశారని తీసిపడేస్తున్నారు. మీడియాకు డీఎస్పీ ఏం మాట్లాడాలన్న ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళుతుందని విమర్శించారు. చివరికి అక్కడి డీఎస్పీ వాష్ రూమ్​కు వెళ్లాలన్నా పెద్దిరెడ్డి పర్మిషన్ తీసుకోవాలని ఎద్దేవా చేసారు. కాబట్టి అలాంటి డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు ఆర్ఓలు పిలిచి మరీ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆ గుర్తును జనసేనకు మినహా ఎవ్వరికీ ఇవ్వద్ధు అని సీఈఓను కోరినట్లు వర్ల రామయ్య వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.