దేశంలో డ్రగ్స్‌ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే: విజయ్‌కుమార్‌ - TDP Vijay Kumar on Vizag Drugs Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 1:05 PM IST

thumbnail

TDP Leader Neelayapalem Vijay Kumar Comments: దేశంలో డ్రగ్స్‌ ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం సర్వసాధారణంగా మారిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ఆరోపించారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌ ఘటనపై సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విజయ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్ ఘటన మరువక ముందే, తాజాగా బ్రెజిల్​ నుంచి వచ్చిన 25 వేల కేజీల డ్రగ్స్​ను విశాఖలో పట్టుకున్నారని తెలిపారు. ఈ కంటైనర్ బుక్ అయిన సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌ యజమానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. అదే విధంగా పలువురు వైసీపీ నాయకులతో దిగిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయని అన్నారు. అసలు వైసీపీ నేతలకు, సంధ్య ఎక్స్​పోర్ట్స్ యజమానికి మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మారుస్తామని గొప్పలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం మత్తుపదార్థాల అడ్డాగా మార్చిందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.