LIVE : డోన్​లో చంద్రబాబు ప్రజాగళం ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam Public Meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 4:37 PM IST

Updated : Apr 29, 2024, 5:46 PM IST

thumbnail

TDP Chief Chandrababu Prajagalam Public Meet in Nandyala District Dhone LIVE : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు నంద్యాల జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. డోన్‌లో ప్రజాగళం అనంతరం, రాత్రికి నందికొట్కూరులో చంద్రబాబు పర్యటన కొనసాగునుంది. ఇప్పటికే ప్రజాగళం- వారాహి విజయోత్సవ సభలు విజయవంతంగా నిర్వహించిన చంద్రబాబు- పవన్‌ కల్యాణ్​లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇతర బీజేపీ జాతీయ నేతలు త్వరలో జతకట్టనున్నారు. నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేటల్లో ఒకటి, మరోచోట బహిరంగ సభల్లో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనేలా కూటమి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈలోగా చంద్రబాబు- పవన్ కల్యాణ్ వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని డోన్​లో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం. 

Last Updated : Apr 29, 2024, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.