ఐదేళ్లుగా సంపాదించుకునే పనిలోనే వైఎస్సార్సీపీ నేతలు మునిగిపోయారు: వర్ల కుమార్‌ రాజా - TDP Candidate Kumar Raja Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 12:41 PM IST

thumbnail

TDP Candidate is Varla Kumar Raja Interview: పల్లెబాట కార్యక్రమం ద్వారా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నానని కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా అన్నారు. ఐదేళ్లుగా డబ్బులు సంపాదించుకునే పనిలోనే వైఎస్సార్సీపీ నాయకులు మునిగిపోయారని మండిపడ్డారు. జగన్ పాలనతో ప్రజలు అలసిపోయి ఉన్నారన్న ఆయన, టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రజా స్పందన పెరిగిందన్నారు. పామర్రులో అభివృద్ధిని వైఎస్సార్సీపీ గాలికొదిలేసిందని మండిపడ్డారు. తనకు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే పామర్రు నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని అంటున్న వర్ల కుమార్ రాజాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.

"వైఎస్సార్సీపీ పాలనతో ప్రజలు అలసిపోయి ఉన్నారు. పామర్రులో అభివృద్ధిని వైఎస్సార్సీపీ గాలికొదిలేసింది. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలు డబ్బు సంపాదనలో మునిగిపోయారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రజా స్పందన పెరిగింది. ప్రజలు నాకు అవకాశం ఇస్తే పామర్రును మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తా." - వర్ల కుమార్ రాజా, పామర్రు కూటమి అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.