ఆర్యవైశ్య సంఘ నాయకుల ధర్నా- వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు రాకేష్‌పై దాడి చేశారని ఆగ్రహం - Arya Vysya Sangam Ceremony Tension

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 2:02 PM IST

thumbnail

TDP Arya Vysya Sangam in Ceremony Was Tension: విజయవాడ మొగల్రాజపురం అమ్మ కల్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నేత బొండా ఉమా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై ఇరు పార్టీల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరినొకరు తోసుకోవటంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. 

ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్​పై వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుచరులు చేసిన దాడిని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ నిరసనకు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు మద్దతు తెలియజేశారు. రాకేష్​పై ఉద్దేశపూర్వకంగానే వైసీపీ రౌడీలు దాడి చేశారని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న డీసీపీ, ఏసీపీ, సీఐలు ఇరు పార్టీల నేతలపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తనపై పోలీసులు కేసు నమోదు చేయటం దారుణమని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.