విద్యుత్​ బిల్లులు షాక్ కొట్టకుండా చూస్తున్నాం: జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 5:49 PM IST

thumbnail

State Electricity Regulatory Board Chairman Justice CV Nagarjuna Reddy : డిస్కంలకు దాదాపు రూ.13 వేల కోట్లు లోటు ఉందని, దానిని భరిస్తామని జెన్కో సీఎండీ ద్వారా ప్రభుత్వం చెప్పిందని రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వెల్లడించారు. విశాఖ కేంద్రంగా వర్చువల్ విధానంలో విద్యుత్​ నియంత్రణ మండలి చేపట్టిన 2024-25 టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. డిస్కంలు ఎటువంటి ఛార్జీల పెంపుదల ప్రతిపాదించలేదన్నారు. రైల్వేకి మాత్రమే వంద కోట్ల ఛార్జీలు పెంపుదల ప్రతిపాదన ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ట్రూ అప్ ఛార్జీల గురించి ప్రశ్నించారన్నారు. దీనిని ప్రధానంగా అర్ధం చేసుకోవాలని, వాస్తవానికి, అంచనాలకు ఉన్న తేడానే ఈ ట్రూ అప్ ఛార్జీలుగా గుర్తించాలన్న ఆయన, ఒకేసారి బిల్లుల టారిఫ్ షాక్ రాకుండా చూస్తున్నామని వివరించారు. రెండు, మూడేళ్ల ట్రూ అప్ ఛార్జీలు బిల్లులలో వస్తున్నాయని చెప్పారు. మన ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు. దేశమంతటా జరుగుతున్న ప్రక్రియ ఇదన్నారు.

విద్యుత్​ ప్రమాదాల విషయంలో జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులకు పరిహారం ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల గతంలో కంటే పరిహారాల చెల్లింపు బాధితులకు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇప్పుడు ఉండే విద్యుత్​ ఛార్జీలు, టారిఫ్ పెరిగే అవకాశం లేదని ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.