డబ్బు సంపాదనకు అడ్డదారి - గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న నలుగురు అరెస్ట్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 5:14 PM IST

thumbnail

SEB Officials Seize 80KGs Ganja in Anakapally District : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి తిరుపతికి అక్రమంగా తరలిస్తున్న 80 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా సెబ్‌ (special enforcement bureau)  అధికారులు పట్టుకున్నారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళగిరి టోల్​గేట్​ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు.

Ganja Smuggling In Narsipatnam : తిరుపతికి చెందిన నలుగురు వ్యక్తులు గత కొంతకాలంగా గంజాయి తీసుకొచ్చి తిరుపతి, బెంగళూరులో విక్రయిస్తున్నారని (smuggling) సెబ్ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వర రావు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. తక్కువ కాలంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశతో నిందితులు ఈ పనిని ఎంచుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో హోల్​సేల్​గా తీసుకుని బయట అమ్ముతున్నారని, బెంగళూర్​లో సైతం వీరు గంజాయి విక్రయిస్తున్నారని సెబ్​ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.