శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్-ఉపాసన - సుప్రభాత సేవలో పాల్గొన్న దంపతులు - Ram Charan Couple Visit in Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:27 AM IST

thumbnail

Ram Charan Couple Visited in Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రామ్ చరణ్ (Konidela Ram charan) దంపతులు తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుమార్తె క్లీంకారతో కలిసి రామ్​చరణ్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రామ్​చరణ్ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మొదటి సారిగా క్లీంకారతో కలిసి రావడంతో ఆలయం వెలుపల రామ్ చరణ్​, ఉపాసనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాసేపు ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది.  

మంగళవారం రాత్రి శ్రీవారి దర్శనం కోసం రామ్​చరణ్​ దంపతులు తిరుమల ఫీనిక్స్‌ అతిధి గృహానికి చేరుకున్నారు. వారికి టీటీడీ అధికారులు, అభిమానులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. పెద్దఎత్తున అభిమానులు అతిథి గృహం వద్దకు చేరుకోవడంతో లోపలకు వెళ్లడానికి కొంత ఇబ్బంది పడ్డారు. టీటీడీ (Tirumala Tirupati Devasthanam) అధికారులు వారికి కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.