అడుగడుగునా సమస్యలపై నిలదీత - ప్రచారం నుంచి జారుకున్న వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి - Protest to MLA Sai Prasad Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 4:56 PM IST

thumbnail

Protest to Adoni YSRCP MLA Sai Prasad Reddy : మే 13న పోలింగ్ తేదీ కావడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ప్రజల్లోకి వస్తున్నారు. కానీ వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. గతంలో ఓ సారి ఓటు అడగడానికి వచ్చారని, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓటు 'అడుక్కోడానికే' వచ్చారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. 2019లో గెలిచిన తర్వాత తమ ముఖం చూసిన పాపాన పోలేదని, సమస్యల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని నిప్పులు చెరిగారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థులు.

YSRCP MLA Candidate Sai Prasad Reddy Election Campaign : కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో మొదటి రోజు ప్రచారం నిర్వహించగా సమస్యలతో గ్రామస్ధులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఇంటి ముందు రహదారి సమస్య పరిష్కరించలేదని తమ గోడు చెప్పుకుంటూ కన్నీరు కార్చి ఎమ్మెల్యేని నిలదీశారు. గ్రామంలో త్రాగునీరు లేవని, తమకు పింఛను రాలేదని, గ్రామంలో రోడ్లు సరిగా లేవని, విద్యుత్ స్తంభాలు లేవని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని నిలదీశారు. అడుగడుగునా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ఈసారి గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గ్రామస్థులకు సముదాయించారు. మొదటి రోజే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రచారం హడావుడిగా ముగించి అక్కడి నుంచి జారుకున్నారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.