ఐదేళ్ల తరువాత ఓట్లు కోసం వచ్చారా? ప్రశ్నించిన గ్రామస్తులకు నచ్చజెప్పి జారుకున్న ఎమ్మెల్యే కుమార్తె - Protest on YSRCP MLA Daughter

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 6:24 PM IST

thumbnail

People Protest on YSRCP MLA Bala Nagireddy Daughter: ఎన్నికలు సమీపిస్తున్న అధికార పార్టీ నేతలు మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు. దీంతో ప్రజల్లో వైసీపీ నేతల తీరుపై భగ్గుమంటున్నారు.  గత ఎన్నికల సమయంలో ఓట్లు అభ్యర్థించటం కోసం వచ్చి అబద్ధపు హామీలు గుప్పించి కనుమరుగైపోయారు. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల విషయమే గాలికి వదిలేసి, మళ్లీ ఐదేళ్ల తరువాత ఓట్లు కోసం ప్రత్యక్షమయ్యారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MLA Daughter Priyanka Election Campaign at Kowthalam: కర్నూల్‌ జిల్లా కౌతాలంలో వైఎస్సార్సీపీ నేతల ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ఎన్టీఆర్ కాలానీలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఓట్ల కోసం మాత్రమే వస్తారు కానీ రోడ్డు, నీళ్లు, డ్రైనేజీ కాలువ సమస్యలను పట్టించుకోలేదని ప్రియాంకను నిలదీశారు. ఈసారి కూడా తమని గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని నచ్చచెప్పి ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.