Live: రాజానగరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర - ప్రత్యక్ష ప్రసారం - Varahi Yatra Live from Rajanagaram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:45 PM IST

Updated : Apr 20, 2024, 8:18 PM IST

thumbnail

Pawan Kalyan Live: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదని అన్నారు. రాయి దాడి విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏపీలో ప్రధాని పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు.  వైఎస్ జగన్​ను భయపెట్టే భారీ మెజారిటీ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు.  మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు.  

Last Updated : Apr 20, 2024, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.