ఉదయం తొమ్మిదైనా వీడని పొగమంచు- ప్రయాణికులకు తప్పని తిప్పలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:26 PM IST
Passengers Suffering with Snow In Bapatla District : బాపట్ల జిల్లాను పొగ మంచు కప్పేసింది. చీరాలతో పాటు పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా అలముకుంది. బస్టాండ్ ప్రాంతంలో దారి కనిపించక వాహనదారులు ఇబ్బందిపడ్డారు. చోదకులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగించారు. పొగమంచుతో విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పలు రైళ్లను (Train) వేగాన్ని తగ్గించి నడిపారు.
Snow Problems In Andhra Pradesh : ఉదయం దట్టంగా పొగ మంచు కమ్మింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. 216 A జాతీయ రహదారి (National High way) జీబీసీ, బస్టాండ్ రోడ్డుపై పొగ మంచు దట్టంగా కమ్మి వాహనాలు సమీపంలోకి వచ్చేవరకు కనిపించలేదు ఉదయం 9 గంటల సమయంలో చోదకులు వాహనాలకు లైట్లు వేసిన నడుపుతున్నారు. మంచు వల్ల ప్రయాణికులకు (passengers) సమస్యలు తలెత్తాయంటున్నారు. మంచు కారణంగా ఉదయం బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.