టీచర్లను గదిలో పెట్టి తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు - ఎందుకంటే?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 7:10 PM IST

thumbnail

Parents Locked Teachers in School in NTR District : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నూతిపాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ల గదికి స్కూల్ కమిటీ పేరెంట్స్ తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులు గదిలో ఉండగా తాళాలు వేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. గత ఎనిమిది నెలలుగా పాఠశాలలో స్థిర ఉద్యోగులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఎంఈఓ, ఎండీఓ, గ్రామ సర్పంచ్​, డీఈఓలకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 57 మంది విద్యార్థులు ఉండగా గతంలో 120 మంది ఉండేవారని వారు పేర్కొన్నారు. 

ఉపాధ్యాయులు రాక విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని స్కూల్ కమిటీ చెబుతుంది. తాగు నీరు కూడా ఇవ్వకుండా ఉపాధ్యాయులను పాఠశాలలో బందీలుగా ఉంచారు. బయటికి వస్తామని చెప్పినా వినకుండా తాళాలు వేశారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు- నేడు పేరుకే ఉంది తప్ప దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.