'వలసలు నివారించేందుకు కృషి చేస్తా' - మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి - Magunta Sreenivasulu interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 1:03 PM IST

thumbnail
'వలసలు నివారించేందుకు కృషి చేస్తా' - మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి (ETV Bharat)

Magunta Sreenivasulu Reddy Interview: నాలుగు సార్లు ఎంపీగా, మూడు దశాబ్దాలు ఒంగోలు పార్లమెంట్​తో అవినాభావ సంబంధం ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి మరోసారి ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్నారు. స్వచ్చంద సంస్థ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ఎంపీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ వివాదరహితుడిగా పేరున్న మాగుంట తెలుగుదేశం పార్టీ తరుపున ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. 

కేంద్రం నుంచి నిధులు మంజూరయినా, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులు ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రయత్నం జరగలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పడకేసిందని, ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమను మంజూరు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగోడు ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానంటున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.