LIVE: పార్వతీపురం నియోజకవర్గంలో నారా లోకేశ్​ శంఖారావం బహిరంగ సభ- ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 11:41 AM IST

Updated : Feb 14, 2024, 12:46 PM IST

thumbnail

Nara Lokesh Shankaravam at Parvathipuram Constituency Live: తొలి మూడు రోజుల కంటే రెట్టింపు ఉత్సాహంతో నారా లోకేశ్ శంఖారావం యాత్ర సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ లోకేశ్ యాత్రను కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం పార్వతీపురం నియోజక వర్గంలో లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్‌కు లోకేశ్​ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్​తో లోకేశ్ ముఖాముఖిలు నిర్వహిస్తూ, సూపర్ - 6 కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్​తో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతల అరాచకాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామనేది వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Last Updated : Feb 14, 2024, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.