LIVE: నెల్లిమర్లలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగసభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 11:30 AM IST

Updated : Feb 16, 2024, 12:48 PM IST

thumbnail

Nara Lokesh Shankharavam Yatra Live : తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన శంఖారావం బహిరంగ సభలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో లోకేశ్ శంఖారావం సభ జరుగుతున్నాయి. సభల్లో పాల్గొన్న నారా లోకేశ్ అధికార వైసీపీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వారి కుటుంబానికి రెండు ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తే మంత్రులు పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై కఠిన చర్యలు తప్పవని లోకేశ్‌ హెచ్చరించారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ అధికారైనా తన రెడ్‌బుక్‌లోకి ఎక్కక తప్పదని హెచ్చరించారు.

నెల్లిమర్లలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగసభ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం

Last Updated : Feb 16, 2024, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.