LIVE: ఇచ్ఛాపురంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర - ప్రత్యక్ష ప్రసారం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 11:11 AM IST
|Updated : Feb 11, 2024, 12:18 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2024/640-480-20721593-thumbnail-16x9-nara-lokesh-sankharavam-yatra-live.jpg)
Nara Lokesh Sankharavam Yatra Live : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. శంఖారావం యాత్ర ఇచ్ఛాపురంలో ప్రారంభమైంది. నేడు పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్ ప్రారంభ సభలో లోకేశ్ ప్రసంగిస్తారు. ఆపై వార్డు స్థాయి నుంచి నియోజకవర స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి.. సూపర్-6 కిట్ల అందజేస్తారు. ఉదయం 'సెల్ఫీ విత్ లోకేశ్' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయా నియోజకవర్గాల్లో 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ', 'మన టీడీపీ యాప్'లో ప్రతిభ కనబరిచిన కార్యకర్తల్ని అభినందిస్తారు. తెలుగుదేశం పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాల్నే రూపొందించారు. మధ్యాహ్నం పలాస, సాయంత్రం టెక్కలి చేరుకుంటారు. రాత్రికి నరసన్నపేటలోని జమ్ము గ్రామ శివారులో ఆయన బస చేస్తారు. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో నారా లోకేశ్ శంఖారావం యాత్ర సాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం