Live: హిందూపురంలో నారా లోకేశ్ శంఖారావం సభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 11:16 AM IST

Updated : Mar 7, 2024, 11:42 AM IST

thumbnail

Nara Lokesh Sankharavam Sabha Live:  నేటి నుంచి రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం కానున్నాయి. నేడు నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించనున్నారు. ఇవాళ హిందూపురం, మడకశిర, పెనుకొండ స్థానాల్లో సభల్లో పాల్గొంటారు.  రేపు పుట్టపర్తి, కదిరిలో నారా లోకేశ్  'శంఖారావం' సభల్లో పాల్గొంటారు. అనంతపురం జిల్లాలో టీడీపీ శంఖారావం పూరించనుంది. ఐదు రోజులుపాటు 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షెడ్యూల్‌ జిల్లాకు అందింది. ముందుగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఈ నెల 7న హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోను శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు. 8న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9న కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10న ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

Last Updated : Mar 7, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.