LIVE కర్నూలు ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో బాలకృష్ణ - ప్రత్యక్ష ప్రసారం - Nandamuri Balakrishna

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 5:50 PM IST

Updated : Apr 16, 2024, 6:46 PM IST

thumbnail

Nandamuri Balakrishna Swarnandhra Sakara Yatra Live in Kurnool District : స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ రెండోరోజు కర్నూలులో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. సోమవారం నందికొట్కూరులో పర్యటించిన బాలకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమవారం కర్నూలు పర్యటించిన బాలకృష్ణకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చి స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సంఘీభావం తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు బాలకృష్ణ వివరించారు. కేంద్ర సహకారం కోసమే బీజేపీ పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ముస్లింలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ఎప్పుడు చూడలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. కర్నూలు జిల్లాలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ వర్గాల వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

Last Updated : Apr 16, 2024, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.