జనాలను మరోసారి మోసేందుకు వైసీపీ కుటిలయత్నాలు : నాదెండ్ల - Nadendla on YCP irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 8:35 PM IST

thumbnail

Nadendla Manohar Meeting with Traders in Tenali: వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎలాగోలా గద్దెనెక్కుదామని మోసపూరిత ఆలోచనలు చేస్తోన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో వ్యాపారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా వ్యాపారులు ఎలా ఇబ్బందులు పడ్డారో గుర్తించాలన్నారు. అసత్యపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యే అయితే చాలన్నట్టు వైసీపీ అభ్యర్థులు చూస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఛరించారు. జనాలను మరోసారి మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ నాయకులు కుటిలయత్నాలు చేస్తున్నారని మనోహర్‌ ఆరోపించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పాలకులకు ముందు చూపు లేకపోవటం వల్ల రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. రానున్న రాజుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.