"కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే అంతా వారికే రాసిస్తా"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 9:34 PM IST

thumbnail

MLA Katasani Rambhupal Reddy: కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తనపై వస్తున్న ఆరోపణలపై సవాల్​ విసిరారు. తాను కబ్జాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగుతోందని, నిరూపిస్తే వాటిని స్థానిక టీడీపీ నేతలకు రాసిస్తానని అన్నారు. రాజకీయ జీవితాన్ని కూడా వదులుకుంటానని తేల్చి చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ అంశంపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.  టీడీపీ నేతలు ఆరోపించిన కబ్జా స్థలాల వద్దనే ఈ చర్చకు సిద్ధమని, అందుకు టీడీపీ నేతలు అధికారులతో చర్చలకు రావాలని సవాల్​ విసిరారు. తాను కబ్జాలకు పాల్పడుతునట్లు తెలుగుదేశం నేతలు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని అన్నారు. అంతేకాకుండా కబ్జాలను నిరూపిస్తే, కబ్జాల్లో తేలిన స్థలాలను టీడీపీ నేతలైన గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిలకు రాసిస్తానని ఎమ్మెల్యే రాంభూపాల్​ రెడ్డి స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.