ఏఐ సిటీ కోసం హైదరాబాద్​లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 3:41 PM IST

thumbnail

Minister Sridhar Babu opened Cyber Towers Tech Hub : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్​వేర్ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్తులో ఈ రంగంలో అపార అవకాశాలుంటాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం దేశంలో సాఫ్ట్​వేర్ రంగంలో 2వ స్థానంలో ఉన్న హైదారాబాద్​ను మొదటి ర్యాంకుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇవాళ సైబర్ టవర్స్​లో పీఎస్​ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్​ను మంత్రి ప్రారంభించారు. జూలైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​పై సదస్సు నిర్వహిస్తామని, ఏఐ(AI) సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని మంత్రి ప్రకటించారు.

Minister Sridhar about Artificial Intelligence : ఈ రంగంలో విస్తృత పరిశోధనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని మంత్రి శ్రీధర్ చెప్పారు. సాఫ్ట్​వేర్ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ఐటీ సంస్థలు సహకరించాలని ​అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అవసరాలు తీర్చుతామన్నారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఈ తరుణంలో తమ సంస్థ తయారు చేసిన సాంకేతికత ద్వారా ఫేస్ రికగ్నిషన్​తో సోషల్ మీడియా ఐడీ సురక్షితంగా ఉంచుకోవచ్చని సంస్థ నిర్వాహకులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.