యువకుడి దారుణ హత్య - ఇంటి పైన నిద్రిస్తుండగా గొంతు కోసిన దుండగులు - man was brutally murdered

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 12:05 PM IST

thumbnail

Man was brutally murdered: నంద్యాల దేవనగర్​లో షేక్ షమీర్  (21) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు షమీర్​ను కత్తితో గొంతుకోసి ప్రాణాలు తీశారు. మృతుడు షేక్ సమీర్ నంద్యాల దర్గా సెంటర్​లో  చికెన్ పకోడా వ్యాపారం చేస్తాడని స్థానికులు తెలిపారు. ఎండకాలం కావడం, ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో షమీర్ రాత్రి ఇంటి పైకప్పు మీద పడుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారు జామున పైకి వెళ్లి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు షమీర్ గొంతు కోసి హతమార్చినట్లుగా గుర్తించారు.  

ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు నంద్యాల 3 టౌన్‌ పోలీసులు తెలిపాారు. హత్యకు వివాహేతర సంబంధమా, లేదా ప్రేమ వ్యవహారమే కారణమా, అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.