లోకమాన్య తిలక్​ ట్రైన్​లో వ్యక్తి హల్​చల్​ - మహిళపై బీర్ బాటిల్​తో దాడి - Attacking on train passengers

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 6:56 PM IST

thumbnail
లోకమాన్య తిలక్​ ట్రైన్​లో వ్యక్తి హల్​చల్​ - మహిళపై బీర్ బాటిల్​తో దాడి (ETV Bharat)

Attacking on train passengers: కాకినాడ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన కాకినాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్​లో లోకమాన్య తిలక్ రైలు ఎక్కిన వ్యక్తి ఓ మహిళపై బీరు బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. మహిళపై దాడి చేసినప్పుడు అడ్డుకునేందుకు యత్నించిన మరో ప్రయాణికుడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వ్యక్తి సత్య బర్మాన్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. దీంతో తోటి ప్రయాణికులు సత్య బర్మాన్ పై తీవ్రంగా దాడి చేసి కొట్టారు. పోలీసులులు అదుపులోకి తీసుకొని జీఆర్పీ స్టేషన్ కు తరలించారు. గాయపడ్డ మహిళను, మరో వ్యక్తిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సత్య బర్మాన్ కు మతిస్థితిమితం సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సత్య బర్మాన్ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.