పరారీలో పిన్నెల్లి - ఏపీ, తెలంగాణ పోలీసుల గాలింపు చర్యలు - Pinnelli EVM Destroy Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 3:48 PM IST

thumbnail
పరారీలో పిన్నెల్లి - ఏపీ, తెలంగాణ పోలీసుల గాలింపు చర్యలు (ETV Bharat)

Macherla MLA Pinnelli EVM Destroy Issue in Andhra Pradesh : ఈ నెల 13 పోలింగ్‌ రోజు ఈవీఎం (EVM)ను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.  తెలంగాణలో పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల కళ్లుగప్పి పిన్నెల్లి మరో కారులో పరారయ్యారు. పిన్నెల్లి కాన్వాయ్‌ను వెంబడించి సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు.  

బాధ్యతాయుత పదవిలో ఉన్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసి వీధి రౌడీలా వ్యవహరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఏపీలో ఎన్నికల నిర్వహణపై సందేహాలు లేవనెత్తుతోంది. పోలింగ్‌ రోజు బరితెగించిన పిన్నెల్లి పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.