5 ఏళ్లుగా బెయిల్ రాకుండా జైల్లో ఉంచుతున్నారు- సీఎం జగన్ కనికరించాలంటున్న కోడికత్తి శ్రీను తండ్రి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 1:21 PM IST
Kodikatthi Srinu father Tatarao worry : జగన్ని అభిమానించినందుకు తన కుమారుడిని అయిదేళ్లుగా జైల్లోనే ఉంచుతున్నారంటూ కోడికత్తి శ్రీను తండ్రి తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2018 అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో ఏం జరిగిందన్నది ఆ దేవుడికే తెలుసు అని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించే కుమారుడిని జైల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
CM Jagan should come to the court and testify : ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చకుని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని తాతారావు విజ్ఞప్తి చేశారు. అయిదేళ్లుగా తన కుమారుడికి బెయిల్ కూడా మంజూరు చేయకుండా జైల్లో మగ్గబెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన కుమారుడిపై కనికరం చూపలని కోరుకున్నారు. ఎన్ఐఏ ఏం జరగలేదని చెబుతున్న తన కుమారుడి కేసును న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారని ఆందోళన చెందారు. న్యాయమూర్తులు ఇప్పటికైనా తన కుమారుడి కేసును విచారించి జైలు నుంచి విడుదల చేయాలని కోరుకున్నారు.