విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 8:08 PM IST

thumbnail

Kishan Reddy on Self Help Groups : ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, స్వయం సహాయక సంఘాలను మరింతగా విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఎస్​హెచ్​జీలకు కేంద్రం ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి డిఫాల్ట్​ లేకుండా రుణాలు కడితే ఆయా సంఘాలకు రూ.20 లక్షలు అప్పు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీని చెల్లించాలని కాని గత ప్రభుత్వ నిధులు మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్​నగర్​లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన శక్తి వందన మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Kishan Reddy on Parliament Elections 2024 : ఎన్నికలు, రాజకీయాలు పక్కన పెట్టి స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించాలని కిషన్​ రెడ్డి అన్నారు. అనంతరం లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు నలుగురు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో డబుల్​ డిజిట్​కు చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ఒకే డీఎన్​ఏకు చెందిన పార్టీలని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.