ఓట్ల అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నా మారని అధికారుల తీరు - టీడీపీ నేతల మండిపాటు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 7:46 PM IST

thumbnail

Irregularities in Bapatla District Voter List: ఓట్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్నికల అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. అధికార పార్టీ నేతలు కోరిందే తడవుగా ఓట్లను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమితులైన పానెం హనిమిరెడ్డి ఎన్నికల యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుటుంబం, బంధువర్గాల ఓట్లను గంపగుత్తగా అద్దంకి పట్టణానికి మార్చుకున్నారు. 

సరైన ఆధారాలు, సక్రమ విచారణ జరపకుండానే ఓట్లు మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 82 ఓట్లు మార్పిడి కోరుతూ దరఖాస్తులు చేసుకోగా పలు పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 25 ఓట్లను గుర్తించారు. వాటిల్లో ఎక్కువ భాగం 155, 156 పోలింగ్‌ బూత్‌లలో ఉన్నాయి. దరఖాస్తులో పొందుపరిచిన ఇంటి నంబర్లు అసలు పట్టణ పరిధిలోనే లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీన్నిబట్టే ఎన్నికల అధికారులు ఓటర్లు సవరణ ప్రక్రియను ఎంత మొక్కుబడిగా మార్చారో స్పష్టమవుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కమిషనర్, ఎన్నికల యంత్రాంగమే దీనికి బాధ్యత వహించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.