మున్సిపల్‌ కార్మికులపై ప్రభుత్వం కీలక నిర్ణయం - కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 12:39 PM IST

thumbnail

Home Department Orders to Withdraw Cases Against Municipal Workers: సమ్మె చేస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికులపై పోలీసులు నమోదైన కేసులను (Cases Against Municipal Workers) కొట్టేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె విరమణ చేసే సమయంలో తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్మికులపై నమోదైన 6 కేసులను కొట్టేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేసులు ఉపసంహరణ: మున్సిపల్ కార్మికులు 2023 డిసెంబరు 26వ తేదీ 2024 జనవరి 11 వరకూ చేసిన సమ్మె (Municipal workers strike in AP) కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు డీజీపీకీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి లేఖ (Municipal Administration Special Chief Secretary Sri Lakshmi) రాశారు. విజయవాడ, విశాఖ, నరసరావుపేట, గుంటూరు, ఏలూరు, కడపలలో కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.