వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి - ప్రతిపక్షాల ఆగ్రహం - Govt Employee in Political Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 12:31 PM IST

thumbnail

Government Employee in Political Campaign in Kurnool District : ఆయనో తపాలా శాఖ ఉద్యోగి కానీ పల్లెలో రాజకీయ పెత్తనం చేస్తున్నారు, ఏకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా అనేక ప్రాంతాల్లో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ ప్రసంగాలు చేయడంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా మద్దికెర మండలం హంపలో లక్ష్మీకాంతరెడ్డి తపాలా కార్యాలయంలో (Postal Office) సబ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. లక్ష్మీకాంత రెడ్డి విధి నిర్వహణ కన్నా గ్రామంలో రాజకీయ పెత్తనాలు ఎక్కువగా సాగిస్తున్నారు. పత్తికొండ వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థి కంగాటి శ్రీదేవి గురువారం మద్దికెరలో కార్యకర్తలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పోస్ట్ మాస్టర్ మైకు తీసుకుని వాలంటీర్లకు హామీ ఇస్తే అందరితో రాజీనామా చేయించేందుకు పాటు పడతామన్నారు. 

ఎన్నికల కోడ్​ను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ అనుచరులు వాలంటీర్లు, ఎమ్మెల్వోల పేరుతో ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అది చాలదన్నట్టు ప్రభుత్వ ఉద్యోగి సైతం ఓటర్లను ప్రేరేపించడం, రాజకీయ ప్రసంగాలు చెయ్యడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.