గన్నవరం ఎమ్మెల్యే వంశీపై అరెస్ట్ వారెంట్ - కేసు విచారణలో గైర్హాజర్​పై కోర్టు ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 1:34 PM IST

thumbnail

Gannavaram MLA Vamsi arrest warrant : గన్నవరం ఎమ్మెల్యే వంశీకి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడు లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు వంశీపై కేసులు నమోదు చేశారు. మొత్తం 38 మంది పై నాలుగు కేసులు నమోదు కాగా, కేసు విచారణకు వంశీ కోర్టుకు హాజరుకాకపోవటంతో బెలబుల్ వారెంట్ ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. నేడు జరిగిన విచారణకు హాజరుకాకపోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.  

టీడీపీ తరఫున గత ఎన్నికల్లో గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ తదనంతర పరిణామాల నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ విప్​  ఫిర్యాదుతో ఇటీవల స్పీకర్ సైతం నోటీసులు ఇచ్చారు.  

కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వంశీ సైలెంట్‌ అయ్యారు. దాదాపు 50రోజులుగా నియోజకవర్గ ప్రజలకు ఆయన కనిపించడంలేదని, హైదరాబాద్‌లోనే ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.