వైసీపీ నేతలు అత్యాచారం చేశారు: భూమా అఖిల ప్రియ వద్ద బాధితురాలు కన్నీటి పర్యంతం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 8:22 PM IST

thumbnail

Former Minister Bhuma Akhila Priya Fired On Jagan: సీఎం జగన్ ఆడుదాం ఆంధ్రా అంటూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. నంద్యాలలో అఖిల ప్రియ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి  వైసీపీ నేతల అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ వాపోయారు. 

ysrcp Leaders Rape in Atmakuru: బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఒంటరి మహిళకు విడో పెన్షన్ ఇప్పిస్తామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన పత్రాలు తీసుకురమ్మని ఆత్మకూరులో అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. నిందితులపై కేసు పెట్టడానికి పోలీసులకు వద్దకు వెళ్తే తనదే తప్పు అంటున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో అరాచకాలు అధికమవుతున్నా పోలీసులు పట్టనట్లు ఉండడం అన్యాయమని అఖిల ప్రియ మండిపడ్డారు. ఆడపిల్లలు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానవత్వం చూపి ఈ ఘటనపై స్పందించాలని అఖిల ప్రియ డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.